బెంగళూర్ : స్వాతంత్ర్య దిన వజ్రోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని రెండవ అంతస్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుండగా పట్టుతప్పి కింద పడిపోవడంతో మరణించిన ఘటన బెంగళూర్లో చోటుచేసుకుంది. మృతుడిని ఐటీ కంపెనీలో పనిచేసే విశ్వకుమార్గా గుర్తించారు.
30 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో అతడి తలపై పలు గాయాలయ్యాయి. విశ్వకుమార్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి నారాయణ్ భట్ హెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు.