ముంబై: పక్షిని కాపాడబోయిన ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. మే 30న 43 ఏళ్ల అమర్ మనీష్ జరీవాలా అనే వ్యక్తి కారులో బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మలాడ్ వెళ్తున్నాడు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు కింద ఒక గ్రద్ద చిక్కుకుంది. దీంతో వెంటనే కారును ఆపమని డ్రైవర్ శ్యామ్ సుందర్ కుమార్కు ఆయన చెప్పాడు. అనంతరం కారు దిగిన వారిద్దరూ ఆ గ్రద్దను రక్షించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు మరో లేన్లో వేగంగా వచ్చిన ఒక ట్యాక్సీ ఆ ఇద్దరినీ బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లో ఎగిరి నేలపై పడ్డారు. ఈ ప్రమాదంలో అమర్ మనీష్ జరీవాలా అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ శ్యామ్ సుందర్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇద్దరు వ్యక్తుల ఉసురు తీసిన ట్యాక్సీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాద సమయంలో అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY
— Singh Varun (@singhvarun) June 10, 2022