రంగారెడ్డి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాచారం మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన గడ్డం గోపీకృష్ణ (35) హైదరాబాద్ నుంచి తన బైకు (టీఎస్05ఎఫ్జీ 6615)పై స్వగ్రామానికి వెళ్తున్నాడు.
చింతపట్ల గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి తన బైకు అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.