సంగారెడ్డి : ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేటలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పుల్కల్ పోలీసుల సమాచారం మేరకు శాంతయ్య(38) అనే ఆటోవాలా సంగారెడ్డి నుంచి జోగిపేటకు సరుకులను తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో డీసీఎం ఢీకొనగా శాంతయ్య సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.