హైదరాబాద్ : కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన స్వామి (38) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల కిందట స్వామి భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల వైరస్ లక్షణాలతో బాధపడుతుండగా.. స్వామికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో నెగెటివ్గా తేలింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్వామి మరణానంతరం చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.