హైదరాబాద్ : నగరంలోని దిల్సుఖ్నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మెట్రోస్టేషన్పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. తీవ్ర గాయాలకు గురైన సదరు వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.