హైదరాబాద్ : తక్కువ ధరకే కొత్త కార్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే కొత్త కార్లంటూ నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి 20 మంది నుంచి రూ. కోటి మేర వసూలు చేశాడు. కూకట్పల్లి, మియాపూర్, కేపీహెచ్బీ పరిధిలో నిందితుడు మోసాలకు పాల్పడ్డాడు. బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన నాగేంద్రప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు.