భద్రాద్రి కొత్తగూడెం : దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కొత్తగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. నిందితుడిని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కన్నాయిగూడెంకు చెందిన పాదం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. నిందితుడు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ్లల్లో దొంగతనాలు చేసేవాడని ఏఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి 2.4 తులాల బంగారం, 35 గ్రాముల వెండి, ఎల్ఈడీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.