హైదరాబాద్ : రుణ యాప్ల కేసులో మరొక వ్యక్తి అరెస్టు అయ్యాడు. ఏపీలోని చిత్తూరుకు చెందిన రాజశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో ఇతడిని అరెస్టు చేశారు. రాజశేఖర్ 9 కంపెనీలకు డైరెక్టర్గా ఉండి పలు రుణ యాప్ల సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు. స్నాప్ఇట్, ఓకేక్యాష్, మైబ్యాంకు, క్యాష్డి, రూపేఫ్యాక్టరీ, బబుల్లోన్ వంటి రుణ యాప్లతో ఒప్పందం చేసుకున్నాడు. రుణ యాప్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశారు. రూ.300 కోట్లు జప్తు చేశారు.