న్యూఢిల్లీ : మైనర్ బాలికను రెండురోజులు గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(22)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి చెర నుంచి బాధితురాలిని కాపాడారు. నిందితుడిని రాజస్ధాన్కు చెందిన విజయ్ అలియాస్ గంగుగా గుర్తించారు. మిధాపూర్ నుంచి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తరచూ తానుండే స్ధావరాలను మార్చాడు.
ఏప్రిల్ 28న వసంత్ కుంజ్ సౌత్ పోలీస్ స్టేసన్లో ఫిర్యాదు నమోదవగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పలు స్ధావరాలపై పోలీసులు దాడులు చేసినా నిందితుడు తప్పించుకుని తిరిగాడు. చివరికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాధితురాలితో పాటు మరో బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు బాలికలను పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. తొలుత ఇద్దరు బాలికల్లో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పరారయ్యాడు. ఆపై బాలికను తనను కలిసేందుకు రావాలని పిలిపించి కిడ్నాప్ చేసి లైంగిక దాడులకు పాల్పడ్డానని దర్యాప్తులో నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.