కాన్పూర్ : పెండ్లయిన ముగ్గురు కొడుకులున్నా ఆ వ్యక్తి లైంగిక వాంఛలతో రగిలిపోయాడు. వందమందికి పైగా మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 66 మందికి పైగా మహిళలు, బాలికలు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రబుద్ధుడిని యూపీ పోలీసులు ఔరియా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితుడు వీరినే కాకుండా పెద్దసంఖ్యలో మహిళలను వేధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మహిళలు, బాలికలు యూపీ ప్రభుత్వ విమెన్ పవర్ లైన్ నెంబర్కు కాల్ చేసి తమ గోడు వెళ్లబోసుకోవడంతో నిందితుడి నిర్వాకం బయటకువచ్చింది. నిందితుడిని రాజేష్ కుమార్గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఔరియా ప్రాంతం జీవసర్సానీ గ్రామానికి చెందిన కుమార్కు ముగ్గురు పెండ్లయిన కుమారులున్నారు. నిందితుడు మహిళలు, బాలికలను తనవద్దకు పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తాను పాడే అశ్లీల పాటలను వినాలని ఒత్తిడి చేసేవాడు. అంతటితో ఆగని 51 ఏండ్ల కుమార్ మహిళలను తనతో అభ్యంతరకర రీతిలో చాట్ చేయాలని బలవంతం చేసేవాడు. కాల్ డిటైల్ రికార్డు ఆధారంగా పోలీసులు కుమార్ బండారాన్ని బయటపెట్టారు. ఇన్స్పెక్టర్ బేలా, విమెన్ పవర్లైన్ అధికారి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కుమార్ను జీవసర్సానీ గ్రామంలో ఆయన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. స్వతహాగా రైతయిన కుమార్ దాదాపు వంద మందికి పైగా మహిళలు, బాలికలను టార్గెట్గా చేసుకున్నాడు. నిందితుడు బాధితురాళ్లను బ్లాక్మెయిల్ చేస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చూసేవాడని నిందితుడి బారినపడిన ఎనిమిదో తరగతి డ్రాపవుట్ బాలిక వెల్లడించింది. ఇక నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.