కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తనకున్న దేశభక్తి చాటుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. అయితే మమత నిర్వహించిన ఎన్నికల సభలో చివరగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మమత తన సిబ్బంది సాయంతో వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. జాతీయ గీతం ఆలపించిన తర్వాత తిరిగి వీల్ చైర్లో కూర్చున్నారు మమత.
నందిగ్రామ్ నియోజకవర్గానికి ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున మమతా బెనర్జీ, బీజేపీ తరపున సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై అందరి చూపు ఉంది. నందిగ్రామ్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి..