న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. శుక్రవారమే ఆయన పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్కరికి ఒకటే పదవి అన్న నియమం ప్రకారం ఆయన ఇవాళ రాజ్యసభలో ప్రతిపక్ష నేత పోస్టుకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఇక రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా రేసులో చిదంబరం, దిగ్విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది.