సిద్దిపేట : జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. 12 రోజుల్లో హుండీల ద్వారా రూ.43,47,983 ఆదాయం లభించింది.
74 గ్రాముల మిశ్రమ బంగారం, 7కిలోల 100 మిశ్రమ వెండి, 13 క్వింటాళ్ల మొక్కుబడి బియ్యం, 15 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపారు.
లెక్కింపులో మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దువ్వల మల్లయ్య, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్, స్థానాచారి పడిగన్నగారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.