సిద్దిపేట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 10వ వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పరవశించి పోయారు. స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 50వేల మంది భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
స్వామి వారి సన్నిధిలో తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానం అచరించారు. నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకున్నారు.