కౌలలాంపూర్ : మలేషియాలో మూడో దశ కరోనా విజృంభిస్తున్నది. బుధవారం మలేషియాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 126 మంది మృతి చెందారు. గత సంవత్సరం మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఒకే రోజు ఇన్ని మరణాలు నమోదవడంతో ఇదే తొలిసారి కాగా.. కొత్తగా 7,703 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మలేషియాలో ప్రస్తుతం 82వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడో విడుత లాక్డౌన్ను ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి 14వ తేదీ వరకు అమలులో ఉండనుంది. సూపర్ మార్కెట్లు, వైద్య పరిశ్రమలతో పాటు ఇతర ముఖ్యమైన రంగాలకు లాక్డౌన్ నుంచి మినయింపును ఇచ్చింది.