మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో సోమవారం రిజ ర్వాయర్ ఒక్క గేటు తెరచి నీటిని దిగువ జూరాల ప్రాజెక్టులోకి విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఇంజినీరు నాగశివ తెలిపారు.
సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా ప్రస్తు తం 2.56 టీఎంసీలు ఉంది. అయితే కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదనీరు అధికంగా రావడంతో స్పిల్వే ద్వారా ఒక గేటును తెరచి దిగువకు 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా సంగంబండ రిజార్వయిర్ నుంచి భారీగా వరద నీటిని విడదల చేయడం వల్ల పెద్ద వాగు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ నాగశివ కోరారు.