మక్తల్ రూరల్: మక్తల్ మండలంలో కృష్ణా నది పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మండలంలోని సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి )బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి నీటిని వాగులోకి విడుదల చేయడంతో మాగనూర్ వాగు పొంగి ప్రవహిస్తున్నదన్నారు. వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని, వాగు తీరంలో అమర్చుకున్న మోటారు పంపులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని ఆయన సూచించారు. అలాగే వరదల కారణంగా కృష్ణా నది తీరంలో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లరాదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరారు.