నాగచైతన్య-సమంత కాంబోలో వచ్చిన చిత్రం మజిలీ. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ ప్రాజెక్టుతో ముంబై భామ దివ్యాన్ష కౌశిక్ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది. రెండేళ్ల విరామం తర్వాత దివ్యాన్ష మరో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగశౌర్య హీరోగా నటిస్తోన్న చిత్రం పోలీసు వారి హెచ్చరిక. తాజా సమాచారం ప్రకారం యాక్షన్ కాప్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్కు దివ్యాన్ష సైన్ చేసిందట.
మేకర్స్ దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని ఇన్సైడ్ టాక్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కేపీ రాజేంద్ర (డెబ్యూట్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.