ముంబై ,జూన్ 26:మొన్నటిదాకా దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు,డీలర్షిప్లు మూతబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధిని జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై ఇప్పటికే వారెంటీని పొడిగించాయి. అంతే కాకుండా రోజు రోజుకి ఈ లాక్ డౌన్ వ్యవధి పొడిగిస్తున్న కారణంగా ఈ వారంటీ వ్యవధి కూడా పొడిగిస్తూ ఉంది.
ఈ విధంగా పొడిగించడం వల్ల తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కంపెనీలు ఈచర్యతీసుకోవడంప్రారంభించాయి.ఇప్పుడు ఇటువంటి కంపెనీల జాబితాలో తన కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ థార్,బొలెరో,స్కార్పియో,ఎక్స్యువి 300,ఎక్స్యువి 500వంటి మోడళ్లతో సహా జూలై వరకు తమ వారంటీని పొడిగిస్తున్నట్లు మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎంజి మోటార్, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా వారెంటీలను పొడిగిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం కూడా కరోనా విస్తరణ కారణంగా ఇదే విధమైన ప్రకటన చేసి దాదాపు వారంటీని 2నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించింది.