MaheshBabu-Rajamouli Movie |మహేష్బాబు-రాజమౌళి ప్రాజెక్ట్పై మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడు సెట్టవుతుందా అని అభిమానులు తెగ ఆరటపడేవారు. ఆ నిరీక్షణకు ఫలితంగా మహేష్బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఫారెస్ట్ అడ్వేంచర్గా ఈ చిత్ర కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశాడని సమాచారం. గతంలోనే వీటి గురించి ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బయటకు రాలేదు. జక్కన్న రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’తో బిజీగా ఉండగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని 2024 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ‘గీతాగోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.