మహబూబ్నగర్ టౌన్: ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి డా.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 20వ, 9వ వార్డుల్లో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నామని, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. పట్టణంలోని అన్ని వార్డులో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ అన్ని సౌకర్యాలు కల్పస్తున్నామని తెలిపారు.
ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధి నిరంతరం పక్రియ అని అన్నారు. మన్యంకొండ సమీపంలో ఎయిర్పోర్టు రానుందని, దానికి మన్యంకొండ వెంకటేశ్వర ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు అనంతరెడ్డి, నరేందర్, పటేల్ ప్రవీణ్, కిశోర్, కో ఆప్షన్ సభ్యుడు మీర్ అర్షద్, నాయకులు పిల్లి సురేశ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.