గూడూరు, అక్టోబర్ 3: అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ‘ట్రబులింగ్ టైమ్స్ సౌత్ ఏషియా, ది పోస్ట్ కలోనియల్’ అంశంపై ప్రసంగించేందుకు వెళ్లనున్నారు.
ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల ప్రతినిధులు ఎంపిక కాగా, అందులో భారత్ నుంచి మోహన్ ఒక్కరే ఉన్నారు. ఇప్లూలో డాక్టరేట్ పొందిన మోహన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గతంలో పరిశోధనలు చేసేందుకు హార్వర్డ్, పెన్సిల్వేనియా తదితర వర్సిటీలకు వెళ్లారు.