ముంబై: కరోనా మూడోవిడత విజృంభణలో పిల్లలపై ఎక్కువ ప్రబావ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర యంత్రాంగం నడుం బిగిస్తున్నది. ఒక్క అహ్మద్నగర్ జిల్లాలోనే మే నెలలో ఎనిమిది వేల మంది కరోన బారిన పడ్డారు. ఇతమంది పసివాళ్లు, టీనేజర్లు ఇన్ఫెక్షన్ కు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని మొత్తం కరోనా రోగుల్లో పదిశాతం చిన్నారులే ఉండడం మామూలు విషయం కాదు. దీంతో ఇతర జిల్లాల్లో కూడా పిల్లల కోసం కరోనా వార్డులను సిద్దం చేస్తున్నారు. సాంగ్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వార్డును విశిష్టమైన రీతిలో రూపొందించారు. దవాఖాన వాతావరణం కాకుండా పాఠశాల లేదా నర్సరీ తరహాలో డిజైన్ చేశారు. సెకండ్వేవ్లో బెడ్స్కు, ఆక్సిజన్కు కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది. థర్డ్వేవ్లో ఆ సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై చివరలో గానీ, ఆగస్టు ప్రారంభంలో గానీ కరోనా థర్డ్వేవ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో మొదలైన సెకండ్వేవ్ వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉంది.