ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి(78) ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దశలో 60 ఏళ్లు పైబడినవారు అదేవిధంగా 45 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అనారోగ్య పరిస్థితులు ఉన్నా టీకాకు అర్హులు. దేశంలో కొవిడ్-19 తీవ్ర ప్రభావం ఉన్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర ఒకటి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో ప్రస్తుతం 86,359 కొవిడ్-19 పాజిటీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 లక్షల 49 వేల 484 మంది కోలుకోగా 52 వేల 340 మంది మృత్యువాతపడ్డారు.