ముంబై : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆసుప్రతిలో చేరారు. శనివారం భుజానికి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనిల్ దేశ్ముఖ్ గతేడాది నవంబర్లో మానిలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్ముఖ్తో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలాండే, షిండే ఈడీ కస్టడీలో ఉండగా.. వాజ్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.
వీరిని కస్టడీని సీబీఐకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దేశ్ముఖ్, పలాండే, షిండే ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా, వాజ్ తలోజా జైలులో ఉన్నారు. మానిలాండరింగ్ వ్యవహారంపై సీబీఐ దేశ్ముఖ్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, దర్యాప్తును ప్రారంభించింది. పరమ్ బీర్ సింగ్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన కొద్ది రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు అరెస్టు నుంచి ఊరట కల్పించడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరై.. వాంగ్మూలం ఇచ్చారు.