ముంబై : ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ర్టలోని నాసిక్లో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 38 ఏళ్ల వయసున్న బాబాసాహెబ్ కోలేకు గత మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బైట్కో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని చేర్చుకోలేదు. అక్కడ్నుంచి మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కూడా చేర్చుకోకపోవడంతో.. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లాడు.
అక్కడ బెడ్ లేదని చెప్పడంతో మరికొన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగి, చివరకు మరో గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడ ఆక్సిజన్ మాస్కు పెట్టినప్పటికీ వైద్యులు పట్టించుకోలేదు. దీంతో ఆ రోగి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. రోగి నిరసనపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతని ఆక్సిజన్ లెవల్స్ 40 శాతానికి పడిపోయాయి. చివరకు ఆస్పత్రిలోనే బాబాసాహెబ్ కోలే ప్రాణాలు కోల్పోయాడు.
ఇవి కూడా చదవండి..