ముంబై: కేంద్ర ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతగాని తనంవల్ల దేశంలో ద్రవ్యోల్బణంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయని ఆయన విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసరాల ధరల పెంపువల్ల సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారం పడిందని పటోల్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 14 నుంచి 19 వరకు మహారాష్ట్ర అంతటా ఆందోళనలు నిర్వహించ తలపెట్టామని ఆయన చెప్పారు.