జడ్చర్లటౌన్, జూన్ 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు గురువారం ముమ్మరంగా సాగాయి. పట్టణప్రగతిలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను విస్తృతం చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి చెప్పారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పర్యటించి పట్టణప్రగతి పనులను పరిశీలించారు. 25వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే వార్డులోని అంతర్గత రహదారులపై చెత్తాచెదారం, ముళ్లపొదలను జేసీబీ సాయంతో తొలగించారు. 6వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్తో కలి సి చైర్పర్సన్ పర్యటించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మురుగు తొలగింపు పనులను పరిశీలించారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు రమేశ్, లత, సిబ్బంది పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జూన్ 16 : మండలంలోని కొత్తతండా, మాటుబండతండా, శంకరాయపల్లి గ్రామాల్లో జెడ్పీ సీఈవో జ్యోతి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు గుంతలను తీయడం, పల్లెప్రకృతి వనాల్లో మొక్కలకు పాదులు చేయడం, పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. అలాగే ప్రతి ఇంటికీ చెత్తబుట్టలు ఇచ్చారా లేదా అని తండావాసులను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతి పల్లెప్రగతిలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా క్రీడాప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలని తెలిపారు. అదేవిధంగా నసరుల్లాబాద్లో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్ ఆధ్వర్యంలో పల్లెప్రగతి పనులను ముమ్మరం చేశారు. గ్రామంలో మురుగుకాల్వలను శుభ్రం చేయించడంతోపాటు కాలనీల్లో పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించారు. అలాగే హరితహారంలో మొక్కలను నాటేందుకు గుంతలను తీశారు. కార్యక్రమాలలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సుందర్రెడ్డి, నర్సింహులు, సుకన్య, రాజేశ్వర్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాసులు, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో జగదీశ్, సర్పంచ్ యాదమ్మ, హరిశ్చందర్నాయక్ పాల్గొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
భూత్పూర్, జూన్ 16 : గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీడీవో మున్ని తెలిపారు. మండలంలోని చౌలతండాలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. అలాగే పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సాయిబాబా, ఎంపీవో విజయకుమార్, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 16 : మండలంలోని పెద్దాయపల్లి, వాయిల్కుంటతండా, ఉడిత్యాల, ఊటకుంటతండా, నేరళ్లపల్లి, బోడజానంపేట తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. ఉడిత్యాలలో తాసిల్దార్ శ్రీనివాసులు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. వాయిల్కుంటతండాలో పంచాయతీ కార్యదర్శి బాసురాథోడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జూన్ 16 : పల్లెప్రగతితో గ్రామాలు కొత్తశోభను సంతరించుకున్నాయని తిర్మలాపూర్ సర్పంచ్ మహేశ్వరి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో శిథిల భవనాలను తొలగించారు. అలాగే చొక్కంపేట, దోండ్లపల్లి, తిర్మలాపూర్, చెన్నవెల్లి, కుచ్చర్కల్, ఖానాపూర్ తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులను చేపట్టారు. కార్యక్రమంలో మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.