మాతృభాషకు విలువ ఇచ్చిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను గౌరవించని వాళ్లు తన దృష్టిలో మనుషులేకాదన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కళాశాల సిల్వర్జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన తనను 17నెలలు జైలులో వేశారని, జైలు జీవితమే రాజకీయాల్లోకి నడిపించిందన్నారు. కలలు కనండి..కష్టపడండి..సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషకు విలు వ ఇచ్చిన వారెందరో చరిత్రలో నిలిచిపోయారని.. మా తృభాషను గౌరవించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవ్యక్తి అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్ర మాజీ మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి విగ్రహాన్ని వెంకయ్యనాయుడు, మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం కళాశాల సిల్వర్జుబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాషను గౌరవించిన కేసీఆర్ గొప్ప వ్యక్తుల్లో ఒకరయ్యారన్నారు. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రామ్నాథ్కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ మాతృభాషలోనే చదివారన్నారు. ఆ తర్వాత ఇతర భాషలపై ప్రావీణ్యం సాధించారన్నారు. మాతృభాష కంటిలాంటిది.. పరాయి భా ష కంటిఅద్దాలాంటివని.. కన్నే లేకపోతే కంటి అద్దాలు ఉండి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.
మాతృభాషను గౌరవించని వాళ్లు అసలు మనుషులేకాదన్నారు. ఇవాళ ఇంగ్లిష్ వస్తేనే ఉన్నతస్థాయికి వెళ్తారనే భ్రమలో చాలామంది ఉన్నారని, మమ్మీ, డాడీ సంస్కృతికి పిల్లలను అలవాటు చేస్తున్నారని ఆవేదన చెందారు. అ మ్మా.. అనే పలకరింపు హృదయాంతరాళల్లోనుంచి వ స్తుందని, మమ్మీ అనే పదం పెదవులనుంచే వస్తోందని.. అమ్మా అనే మాధుర్యం అనిర్వచనీయమైనదన్నారు. తానూ జైపాల్రెడ్డి ఇద్దరూ జాతీయవాదులే అయినా సి ద్ధాంత పరంగా భిన్నమైన వాళ్లం అని గుర్తుచేశారు.
రా జకీయాల్లో ప్రత్యర్థుల్లా ఉండాలేగాని శత్రువుల్లా ఉండొద్దని హితవుపలికారు. చట్టసభల్లో డిస్కస్, డిబేట్, డిస్ర్కైబ్ చేయాలి కాని సభను డిస్ట్రబ్ చేయొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్లో తాను జైపాల్రెడ్డి సంధించే విమర్శలకు ఆనాటి ప్రభుత్వాల వద్ద జవాబు ఉండేది కాదన్నారు. ప్రభుత్వాలను విమర్శించాలే కాని వ్యక్తిగతంగా దూషించొద్దన్నారు. రాజకీయాల్లో ఓపిక ఉండాలని, కష్టపడి శ్రమిస్తే పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధిస్తారని భవిష్యత్ రాజకీయ నే తలకు సూచించారు. రా జకీయాల్లో నైతిక విలువ లు, నీతి నిజాయితీ, అవసరమన్నారు.
అబ్దుల్క లాం అన్నట్లు కలలు క నండి.. కష్టపడండి.. సా కారం చేసుకోవాలని వి ద్యార్థులకు పిలుపునిచ్చా రు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన తన ను 17నెలలు జైలులో పెట్టారని, జైలు జీవితమే రాజకీయాల్లోకి నడిపించిందన్నారు. జైపాల్రెడ్డిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండి జయప్రకాశ్ నారాయణ్ ఎందరి కో ఆదర్శంగా నిలిచారన్నారు.
రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహించని గొప్పవ్యక్తి జైపాల్రెడ్డి : మంత్రి శ్రీనివాస్గౌడ్
రాజకీయాల్లో ఉన్నత విలువలతో ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచి ఈప్రాంతానికి వన్నె తెచ్చిన జైపాల్రెడ్డికి ఎలాంటి రాజకీయ ప్రోత్సాహం లేకున్నా ఎదిగారని.. తదనంతరం వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా రాజకీయాల్లో రాణించడం..రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహించని గొప్ప వ్యక్తిత్వం ఆయనదన్నారు. విలువలతో కూడిన నాయకుడు జైపాల్రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఉద్యమ సమయంలో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి జై పాల్రెడ్డితో గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ తాను జైపాల్రెడ్డిని కలవడానికి వెళితే అదిగో కొట్లాడనికే వస్తున్నాడని అనుచరులకు చెప్పేవాడని..అవును నేనే కొట్లాడడానికే వచ్చినా అని అనేవాడన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రకటిస్తే అందులో ఒక రిజర్వాయర్ కూ డా లేదని ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే మనల్ని మభ్యపెట్టడానికి ఇలా చేస్తారని ఆనాడే చెప్పారన్నారు. తెలంగాణ వచ్చాక కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు అందుతున్న నీళ్లను చూస్తే ఆ మహానుభావుడు సంతోషపడేవారన్నారు.
జయప్రకాశ్ నారాయణ్ ఎందరినో ప్రభావితం చేశారు : మంత్రి నిరంజన్రెడ్డి
లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వ్యక్తిత్వం సా మీప్యతతో ప్రభావితులైన వారు ఎంతోమంది ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని అధ్యయనం చేసిన యువ మేధావిగా స్వా తంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాజకీయ పదవులకు దూరంగా ఉండి దేశం బాగుపడాలని భా వించిన మహనీయుడు అని అన్నారు. జైపాల్రెడ్డి, వెం కయ్యనాయుడు విలక్షణమైన ప్రతిభాశీలమైన వ్యక్తి త్వం కలిగిన సమకాలీకులన్నారు.
ఇద్దరూ తెలుగుజా తి ఖ్యాతిని పెంచిన నేతలని మంత్రి కొనియాడారు. ఈ రోజు చాలా చారిత్మ్రాతకమైన దినమని తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాలకు రూపకల్పన చేసిన రోజునే జయప్రకాశ్ నారాయణ్ జయంతి కావడం, దివంగత జైపా ల్ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. అంతకుముందు జయప్రకాశ్ నారాయణ్ 120వ జ యంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్ పాల్గొన్నారు.