విద్యార్థినులు.. మహిళల వెంటపడుతున్న ఆకతాయిల్లో మైనర్లు.. యువకులే అధికంగా ఉంటున్నారు. ఈ విషయం షీ బృందాలు నమోదు చేసిన కేసుల్లో వెల్లడవుతున్నది. కుటుంబ పెద్దలు పిల్లలను పట్టించుకోకపోవడం.. సినిమాలు.. సామాజిక మాధ్యమాలు వీరిని మరింత ప్రభావం చేస్తుండడంతో యువలోకం దారితప్పుతుంది. ఈ విషయం అధికారుల గణాంకాల్లో వెల్లడైంది. అయితే బాధితుల్లో చాలా మంది ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు అవగాహనతోనే సరిపెడుతున్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 6 : జిల్లాలో షీ బృందాల పనితీరు బాగా పెరిగింది. విస్తృతంగా త నిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ప్రజల్లో ఈ బృందాల గురించి అవగాహన పెరగడంతో బాధితులు సంప్రదించడం ప్రారంభించారు. అయితే పట్టుబడుతున్న వారిలో యుక్త వయస్సు వారే అధికంగా ఉం డడం ఆందోళన కలిగిస్తున్నది. మైనర్లు, అంతకంటే కొ ద్దిగా వయస్సు పెరిగిన వారు ఎక్కువగా యువతులు, మహిళల వెంట పడుతున్నారు. అసభ్య సంభాషణలు చేయడం.. దురుసుగా ప్రవర్తించడం.. వారు ఆకతాయి వేషాలతో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయం షీ బృందాల పరిశీలనలో వెల్లడవుతున్నా యి. విద్యార్థినులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే సమయంలో పోకిరీలు వెంటపడి చేతులు పట్టుకోవడం.. ఫోన్ నెంబర్లు ఇచ్చేందుకు ప్రయత్నించడం.. వారి వెం ట పడుతూ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీరి వేధింపుల బారిన పడుతున్న వారిలో విద్యార్థినులే అధికంగా ఉంటున్నారు.
ఆధారాలతో సహా..
షీ బృందాలు ఆకతాయిల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. మహబూబ్నగర్, జడ్చర్ల ప్రాం తాల్లో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాలల వద్ద గతంలో ఆకతాయిలతో వి ద్యార్థినులు ఇబ్బంది పడేవారు. కాని షీ టీం సభ్యు లు నిత్యం ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. దీంతో జులాయిల బెడద తగ్గింది. ముందుగా ఆకతాయిల చేష్టలను షీ టీం సభ్యులు వీడియో చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఫలితంగా పోలీసులు పట్టుకున్న తర్వాత తాను అలాంటి పనులు చేయలేదని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.
కౌన్సెలింగ్తో సరి
షీ బృందాలు పట్టుకున్న ఆకతాయిలు చాలామంది మళ్లీ ఇలాంటి పనులు చేయడం లేదని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు పట్టుబడిన వారిలో 16 నుంచి 26 ఏండ్లలోపు వయస్సున్న యువకులే ఉం డడం గమనార్హం. బృందం సభ్యులు ఆకతాయిలను పట్టుకున్న వెంటనే వారి తల్లిదండ్రులు, కుటుంబ స భ్యులను పోలీసు స్టేషన్కు పిలిపిస్తున్నారు. మహిళా పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆకతాయిలతో పాటు వారి కుటుంబీకులను పిలిపిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తే సంబంధిత వ్య క్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే చాలామంది బాధితులు ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడంతో కౌన్సెలింగ్తోనే సరిపెడుతున్నారు. కుటుం బ సభ్యులకు చట్టాలతో పాటు జైలుకు వెళితే కలిగే నష్టాలను అధికారులు వివరిస్తున్నారు. మూడున్నర ఏండ్లల్లో 25 కేసులు నమోదు కాగా 109 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.