తెలంగాణ ఏర్పడ్డాక కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని వృత్తుల్లోని కార్మికులకు, వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నది. పింఛన్లు, బీమా, ఎక్స్గ్రేషియాతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నది. ఇలా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కార్మికుల కష్టాలు తీరాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కార్మికలోకం కోరుకుంటున్నది.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో కార్మికుల వెతలు తీ రాయి. ఎనిమిదేండ్లలో ఒక్క కార్మిక వర్గం ఆందోళన బాటపట్టలేదు. ప్రతి సమస్య మీద ఎర్రజెండాలు ఎత్తే కమ్యునిస్టులు సైతం గులాబీ జెండాకు జై కొడుతున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో కార్మిక లోకం కష్టాలన్నీ తీరాయి. బీడీలు తయారుచేస్తున్న వందలాది కుటుంబాలను ఆసరా పింఛన్తో ఆదుకుంటున్నారు.
ప్రాణాలు ఫణంగా పెట్టే కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియో ఇస్తున్నది. పెద్ద పెద్ద పట్టణాల్లో నీరా స్టాళ్ల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. దీంతో నచ్చిన ధరకు అమ్ముకొని బతకొచ్చన్న భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. సబ్బండ వర్గాల సమస్యలను పరిష్కరించడంతో కార్మికలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. బీడీ, గీతా, చేనేత, భవన నిర్మాణ రంగం, చిన్నాచితక పరిశ్రమల్లోని కార్మికులకు కేసీఆర్ చేయూతనిస్తున్నారు. ఆటో, క్యాబ్లు నడిపే డ్రైవర్లకు..
ఇలా ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నేతన్నలకు బతుకమ్మ చీరలు నేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి భరోసా కల్పించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. ఇటీవలే బీమా సౌకర్యం కూడా కల్పించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్ర మాద బీమా కల్పించి ఆదుకుంటున్నది. కార్మిక సంక్షేమ శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న అనేక మంది కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో కార్మిక లోకం ఆందోళనలను మరిచారు. ఇలాంటి వ్యక్తి దేశానికి నాయకత్వం వహిస్తే దేశవ్యాప్తంగా కార్మిక లోకం బాగుపడుతుందని, కష్టం చేసే కార్మికుల పక్షాన నిలబడ్డ మహనీయుడు కేసీఆర్ అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్ర పథకాలు దేశ వ్యాప్తం కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ఈ సారి కేసీఆర్ కోసం తామంతా జెండాలు ఎత్తుతామంటున్నారు.
ధరలకు కళ్లెం వేయాలి..
తెలంగాణలో పండించిన వరి కొనేందుకు కేంద్రం తిప్ప లు పెడుతున్నది. రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రానికి సరైన గుణపాఠం చెప్పాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఆయన ప్రధాని కావాలి. రైతుబీమా, రైతుబంధు పథకాలు దేశవ్యాప్తంగా అమలైతే మన దేశం ప్ర పంచానికే అన్నం పెడుతుంది. అన్ని రకాల ధరలు కూడా పెరిగాయి.
-గ్యాస్, పెట్రోల్ ధరలకు కళ్లెం
పడలాంటే కేసీఆర్ ప్రధాని కావాల్సిందే. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే దేశం కూడా రా ష్ట్రం తరహాలో అభివృద్ధి చెందుతుంది. ప్రశ్నించే గొంతు లే క మోదీ ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజే పీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే లౌకికవాదం ఏర్పడుతుంది.
– యాదయ్యగౌడ్, మోటార్ వైండింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, మహబూబ్నగర్
గులాంల గడీలు బద్దలవుతాయి..
గుజరాత్ను మోడల్గా చూపించి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశానికి చేసిందేమీ లేదు. ఉత్తరాది గడీల కోటను బద్దలు కొట్టే సత్తా ఒక్క కేసీఆర్కే ఉన్నది. ఆ రాష్ర్టానికే ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ర్టాలపై వివక్ష పోవాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉండాల్సిందే. గతంలో ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపే పరిస్థితి. ఇప్పుడు ఆ దుస్థితి పూర్తిగా మారిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అడిగే వాళ్లే లేరు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నది. తెలంగాణ వచ్చాక రైతులకు 24 గంటల కరెంట్, రైతుబంధు, బీమా సౌకర్యం కల్పించి భరోసా కల్పించారు. ఇలాంటి నాయకులు దేశ రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వం వహించాలి. కేసీఆర్ జాతీయ పార్టీ తప్పక పెట్టాలి.
జనం మెచ్చిన నేత..
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశంలో అమలు కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. కార్మికులను మోదీ స ర్కార్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ పీఎం అయితే కార్మికులకు మంచి రోజులు వస్తా యి. కార్మికులంతా వేయి కళ్లతో కేసీఆర్ కో సం ఎదురుచూస్తున్నారు. రావాలి కేసీఆర్.. కావాలి ప్రధాని.. ప్రస్తుతం దేశ స్థితిగతులను మెరుగుపర్చే గుణగణాలు ఉన్న నాయకుడు. దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో కూడా రాణించగలరన్న నమ్మకం అందరికీ ఉన్నది. మా సంపూర్ణ మద్దతు ఆయనకే ఉంటుంది.
– సురిటి వెంకటేశ్, కరెంట్ కార్మికుల సంక్షేమ సంఘం నాయకుడు, మరికల్
మారనున్న కార్మికుల బతుకులు..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే కార్మికుల బతుకులు మారుతాయి. నే డు అధిక ధరలతో ఉపాధి కూలీ అవకాశా లు తగ్గాయి. ధరల నిచ్చితి వీడాలంటే కేసీఆ ర్ ప్రధాని కావాల్సిందే. రాష్ట్ర రాజకీయాల ను శాసించే కేసీఆర్.. జాతీయ స్థాయిలోకి వెళ్లి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారనే న మ్మకం అందరికీ ఉన్నది. దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఆయనకెంత మంచి జరుగుతుందో తెలియదు కానీ.., రాష్ట్ర ప్రజలకు మాత్రం రెట్టింపు మంచి జ రుగుతుంది. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపించే కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి రావడం అన్ని రాష్ర్టాలకు శుభపరిణామం.
– మొహ్మద్గౌస్, భవన నిర్మాణ కార్మికుడు, అమ్రాబాద్
కేసీఆర్తోనే దేశాభివృద్ధి..
రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు దేశాన్ని మార్చే సత్తా ఉన్నది. రైతే దేశానికి వెన్నెముక అన్న సత్యా న్ని గుర్తించి.. అన్నదాతను రారాజు చేశాడు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే స మూలంగా మార్పులు వస్తాయి. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరించిన నాయకుడు కేసీఆర్. దేశ రాజకీయాలపై ఆయనకు అవగాహన ఉన్నది. తలసరి ఆదాయాన్ని పెంచి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేశాడు. అన్ని రాష్ర్టాల నేతలను ఏకతాటిపై తీసుకురాగల మహోన్నతుడు. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రంగాలు పురోగాభివృద్ధి సాధిస్తాయి.
– పశ చంద్రయ్య, ఆటో డ్రైవర్, అనంతవరం, బల్మూరు
కేసీఆర్కే మా మద్దతు..
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ అవేవీ పట్టించుకోలేదు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నది. పీఎం మోదీ విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన కేసీఆర్కు దేశ యవత సహకరించాలి. కేసీఆర్కు సె్రంటల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన రాకను స్వాగతిస్తున్నాం.
– అజయ్, సీఐటీయూ కార్మిక సంఘం నాయకుడు, అమరచింత
శ్రమను దోచుకునేలా చట్టాలు..
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు, శ్రమను దోచుకునేలా నూతన చట్టాలను తీసుకొచ్చింది. కాంగ్రెస్, బీజేపీ లు కార్మికుల హక్కులను కాలరాస్తూ వచ్చాయి. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ను స్వాగతిస్తున్నాం. కార్మికుల హక్కుల కోసం సీఎం కేసీఆర్ కట్టుబడుతాడని విశ్వసిస్తున్నాం. సుప్రీంకోర్టు సిఫారసు చేసిన సమాన పనికి సమానం వేతనాన్ని అమలు చేయాలి. కేసీఆర్ దేశ రాజకీయాల్లో కార్మికుల పక్షాన ఉంటూ విప్లవాత్మకమైనమార్పు తీసుకొస్తాడన్న నమ్మకం ఉన్నది.
– సూర్యవంశం రాముడు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వనపర్తి
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి..
యావత్ దేశానికి కేసీఆర్ నేతృత్వం వహిస్తేనే అన్ని వ ర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాలని ప్రవాస భారతీయులు కూడా కోరుకుంటున్నారు. ఆయన పీఎం అయితే ఇటు రైతులు అటు కార్మిక రంగం కూడా అభివృద్ధి చెందుతుం ది. బీజేపీ పాలనలో దేశం ఎంతో వెనుకబడిపోయింది. దేశాన్ని సరైన దిశలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ రావాలి. మా మద్దతు ఎల్లప్పుడూ ఆయనకే ఉంటుంది.
– అస్కని శ్రీను, తాపీ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు, కొత్తకోట
కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి..
దేశ ప్రగతికి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. దేశ ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుంది. దిశానిర్దేశం తెలిసిన నాయకుడు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశంలో కూడా రావాలంటే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పాటునందించే కేసీఆర్ పీఎం అయితే దేశం ఎంతో అభివృద్ధి జరుగుతుంది.
– తరగం లక్ష్మయ్య, అరుంధతి హమాలీ సంఘం అధ్యక్షుడు, చిన్నంబావి
ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం..
ప్రస్తుతం దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయం అవసరం. అందుకు సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలి. బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పొకడతో కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రజాధనాన్ని ఇద్దరు, ముగ్గురికి మాత్రమే దోచిపెడుతున్నది. దానికి అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా సెక్యులర్, ప్రాంతీయ, వామపక్ష పార్టీలను కలుపుకొని బలమైన బీజేపేతర శక్తులుగా ఎదగాలి. ఇదంతా కేసీఆర్ తోనే అవుతుంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ దేశ సంక్షేమం కోసం కూడా పాటుపడాలి. దూరదృష్టి ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో కూడా రాణించగలరన్న నమ్మకం అందరికీ ఉన్నది.
– వడ్డెమాన్ నారాయణ, హమాలీ సంఘం ప్రధాన కార్యదర్శి, చిన్నంబావి
మోదీకి తగిన బుద్ధి చెప్పాలి..
రాష్ట్ర సాధనలో చావు వరకు వెళ్లి పోరాడిన వ్యక్తి కేసీఆర్. అనుకున్న లక్ష్యం కోసం దేనికైనా వెనుకాడడు. రాష్ట్రంలాగే భారతదేశం కూడా అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశాన్ని పాలించడంలో విఫలమయ్యాయి. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ సేవలు ఎంతో అవసరం. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రంలాగే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఏ ఒక్క ప్రభుత్వ మూ పేదల అభివృద్ధికి పాటుపడలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ల ను ప్రైవేట్ పరం చేస్తున్నది. ఇది దేశానికి ఎంతో నష్టం చేకూరుస్తుంది. ఆర్థిక, అసమానతలు పెరిగి అరాచకాలు సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
– రేపల్లె దేవదాసు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, అలంపూర్