మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డ బుల్ బెడ్రూం ఇండ్లను ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకున్న ఉదంతం పాలమూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆరుగురు నిందితుల ముఠాను పోలీసులు అరె స్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ హసన్ బీజేపీ మైనార్టీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ కావడం గమనార్హం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లిలో ప్రతిష్టాత్మకంగా ని ర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఫేక్ డాక్యుమెంట్లు, తాసిల్దార్ ఫో ర్జరీ సంతకాలు చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. కాగా, ఆ ఇండ్లల్లో దా దాపు 40 మంది ఎవరికి వారు వెళ్లి ఉంటుండడంతో అనుమానం వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంపై విచారణ జరపాలని అర్బన్ తాసిల్దార్ పార్థసారధిని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన తాసిల్దార్కు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. డబుల్బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామ ని 40 మంది వద్ద రూ.67.35 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ప్రొసీడింగ్లు నకిలీవని తేలాయి. దీంతో తాసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ మైనార్టీ మోర్చాకు చెందిన నేత మరికొందరితో కలిసి డబుల్ బెడ్రూం స్కాంకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మంగళవారం ఆరుగురు నిందితులను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
దివిటిపల్లి గ్రామ శివారులో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రతిష్టాత్మకంగా 1024 డబుల్ బె డ్రూం ఇండ్లను కట్టించారు. ఇటీవలే మంత్రి కే టీఆర్ వీటిని ప్రారంభించారు. జిల్లా కేంద్రం లో ఇండ్లు లేని నిరుపేదలకు వీటిని కేటాయించేందుకు కలెక్టర్, ఇతర అధికారుల సమక్షంలో లక్కీడిప్ తీసి ఇండ్లను కేటాయించారు. దశల వారీగా కేటాయింపులు జరుగుతున్న తరుణం లో మహబూబ్నగర్లో డబుల్ బెడ్రూం ఇం డ్లను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు యత్నించి దొరికిపోయారు.
40 మంది బాధితులతో లక్షలు వసూలు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొన్ని రో జులుగా డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్ముకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇండ్ల కోసం కొందరు దళారులను నమ్మి లక్షలు ఇచ్చారు. అయినా ఇళ్లు రాలేదు. సుమారు 40 మంది ఈ ముఠా చేతిలో డబ్బులు పెట్టి మోసపోయారు. ఇప్పడు వస్తది.. అప్పుడు వస్తది..
అని చెబుతుండడంతో అనుమానం వచ్చి పోలీసులను బాధితులు ఆశ్రయించడంతో ఈ తంతంగం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి అసలు వి షయం బయటపడింది. దీంతో ప్రధాన నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా తాసిల్దార్ పేరు మీద ప్రొసీడింగ్స్ సైతం ఫేక్వి త యారు చేశారు. దీంతో పోలీసులు అసలు నిందితుడిని అరెస్ట్ చే శారు. దీంతో డొంకంతా కదిలింది.
ప్రధాన నిందితుడు బీజేపీ నాయకుడే..
పాలమూరు జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం స్కాంలో ప్రధాన నిందితుడైన సయ్యద్ హసన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తె లుసుకుని లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేస్తుంటాడు. ఇదే అదనుగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో అతన్ని ఆ పార్టీ పట్టణ మైనార్టీ ప్రెసిడెంట్గా నియమించింది. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇండ్లపై నేత కన్ను ప డింది. ఎలక్ట్రికల్ రిపేర్ షాపులో పనిచేస్తున్న జాఫర్, మెడికల్ అసోసియేషన్లో పనిచేస్తున్న అమీర్, రియల్ వ్యాపారం చేస్తున్న కమ్మర్తి వెంకటయ్య, మెహరూన్, ఇంద్రజతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సుమారు రూ.67.35 లక్షలు వసూలు చేశారు. సుమారు 40 మందితో డబ్బులు తీసుకుని పట్టాలు ఇవ్వకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రత్యేక టీం ఈ కేసును ఛేదించింది. ఆరుగు రు నిందితులను అరెస్ట్ చేసి నగదు, కారు, కంప్యూటర్, రబ్బర్ స్టాంపుల ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా పేదల డబుల్ బెడ్రూం ఇండ్లస్కామ్లో బీజేపీ నేత ప్రధాన నిందితుడు కావడం, ఆయన్ను పార్టీలో చేర్పించిన నేతలపై ఆ పార్టీ నేతలు ఏం యాక్షన్ తీసుకుంటారోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.