పోషకాహార లోపం చిన్నారుల పాలిట రక్కసిగా మారుతున్నది. తల్లిపాలతోపాటు సంపూర్ణ పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడంతో చిన్నారులు సైతం అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనిని నివారించేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ పేరిట నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 30వరకు ప్రతి వారం ప్రత్యేక కార్యాచరణతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు విద్యాధికారులు ముందుకు సాగుతున్నారు.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగా ణ) : చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగాలం టే పోషకాహారం తప్పనిసరి. అయితే, తల్లులకు సరైన అవగాహన ఉండడం లేదు. ఫలితంగా ఆరోగ్యంగా పుట్టకపోవడంతోపాటు ఎదగకపోవడం జ రుగుతున్నది. దీంతో చాలా మంది పిల్లలు ప్రాణా లు కోల్పోతున్నారు. దీనిని నివారించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2018 నుంచి ఏటా సెప్టెంబర్లో పోషణ్ అ భియాన్ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నది.
ఈనెల 30వ తేదీ వరకు ప్రతి వారం ఒక అంశంపై కార్యాచరణ చేపడతారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించడమే ఈ మాసోత్సవ లక్ష్యం. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ఆ రోగ్యలక్ష్మి పథకంలో భాగంగా ఒక పూట సంపూర్ణ భోజనంతోపాటు గుడ్లు అందజేస్తున్నారు. కాగా, పుట్టిన శిశువులకు ఆరు నెలల తర్వాత తల్లిపాలతోపాటు అనుబంధ ఆహారం అందించాల్సి ఉం టుంది. పోషక మాసోత్సవ్లో భాగంగా ముం దుగా చిన్నారుల వయస్సుకు తగిన ఎత్తు, బరువులను గుర్తిస్తారు. అలాగే ఆ పిల్లల ఇంటికి ప్రత్యేకంగా అదనపు ఆహారం అందిస్తారు. నెల తర్వాత పిల్లల ఎత్తు, బరువు ఎంత ఉందో సేకరిస్తారు.
ఈ వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎర్ర రంగు చార్టుల్లో పొందుపర్చి త ల్లులకు ఇస్తారు. దీన్ని బట్టి ఆరేండ్లలోపు చిన్నారులకు ఏయే మోతాదులో పోషకాహారం అందించా లో వివరిస్తారు. ఇలా పోషకాహారం ద్వారా పిల్లలకు కలిగే ప్రయోజనాన్ని వివరించేలా అవగాహ న కల్పిస్తారు. పిల్లల్లో చురుకుదనం, లోప పోషణ తగ్గించడం, పిల్లలు, మహిళలు, కౌమార బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతోపాటు తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం ఈ మాసోత్సవ లక్ష్యం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతాశిశు రక్షణ, పౌష్టికాహారం అందించే చర్యలు చేపడుతున్నారు. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతున్నది.
నాలుగు వారాలు ఇలా..
పోషణ్ అభియాన్ మాసోత్సవంలో భాగంగా మొదటి వారం విద్యాశాఖతో సమన్వయం చేసుకొని పిల్లల ఎత్తులు, బరువులు తప్పులు లేకుండా నమోదుచేస్తారు. రెండో వారంలో ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం, ఊరేగింపులు చేపడతారు. మూడో వారంలో న్యూట్రీ గార్డెన్, కిచెన్ గార్డెన్లో భాగంగా సమతుల ఆహారం తీసుకోవడం, పాఠశాల ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచడం పై అవగాహన కల్పిస్తారు. నాలుగో వారంలో పో షణ్ మేళా నిర్వహించి పౌష్టికాహారం కలిగిన పదార్థాలపై వివరిస్తారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి ఆహారం వంటి అంశాలపై చిత్రలేఖన పోటీలు ని ర్వహిస్తారు. పీహెచ్సీలను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరిస్తారు. సీసా పాలు పట్టడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తా రు. స్కూళ్లు, అంగన్వాడీల్లో కూరగాయల పెం పకం వల్ల కలిగే లాభాలను వివరిస్తారు. అనుభ వం ఉన్న నిపుణులతో గర్భిణులు, బాలింతలకు యోగా తరగతులు నిర్వహిస్తారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
పౌష్టికాహారం ఇలా..
శిశువు పుట్టిన గంటలోగా ముర్రుపాలు తాగించాలి. పిల్లలకు ఆరు నెలలు నిండేదాకా కేవలం తల్లిపాలే పట్టాలి. తాగునీరు లేదా ఇతర ద్రావణా లు ఏవీ ఇవ్వకూడదు. ఇక 6 నెలల నుంచి 12 నెలలలోపు పిల్లలకు ఇంట్లో వండిన అన్నం, ప ప్పు, కూర, గుడ్డు అయితే మెత్తగా చేసి.. పండు అయితే గుజ్జుగా చేసి 250 మి.లీ. గిన్నెలో సగం నుంచి 3వ వంతు ఉండేలా చూసుకొని రోజుకు 2 నుంచి 3 సార్లు తినిపించాలి. ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్ మెత్తగా చేసి తినిపించొచ్చు. చిరుతిండి (ఇంట్లో తయారు చేసిన స్నాక్స్) ఒకసారి పెట్టాలి. ఈ ఆహారంతోపాటు తల్లిపాలు కూ డా తప్పనిసరిగా ఇవ్వాలి. మెత్తగా చేసిన అరటి, బొప్పాయిపండ్లను తినిపించాలి.
పోషకాహారంపై అవగాహన..
పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా పోషణ్ అభియాన్ మాసోత్సవం నిర్వహిస్తున్నాం. నెలపాటు ప్రతి వారం ఒక్కో అంశంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. పుట్టిన బిడ్డలు వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఉంటూ ఆరోగ్యంగా ఎదిగేలా తల్లులకు అవగాహ కల్పిస్తాం. ప్రతి అంగన్వాడీకి నెలాఖరులోగా మిషన్ భగీరథ కనెక్షన్లు ఇప్పించాలని మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. ఆర్బీఎస్కే బృందం బ్యానర్లతో ప్రచారం చేస్తారు. నాగర్కర్నూల్ జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో 43,967 మంది సాధారణ ఆరోగ్యవంతులుగా ఉండగా.. మరో 5,470 మంది చిన్నారులు మధ్యస్త ఆరోగ్యంగా ఉన్నారు. ఇక 437 మంది చిన్నారులు అతి తక్కువ బరువుతో ఉన్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతున్నది. దీనికిగానూ 7,332 మంది గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నాం.
– వెంకటలక్ష్మి, సంక్షేమ శాఖ జిల్లా అధికారి, నాగర్కర్నూల్