మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 18 : క్రీడల్లో దేశంలోనే రాష్ర్టాన్ని నెంబర్వన్గా ని లుపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్వతంత్ర భారత వ జ్రోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రా మంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశామన్నారు. వాలీబాల్, క్రికెట్, ఖోఖో కోర్టులతోపాటు అవసరమైన క్రీడా సామగ్రిని ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 2000పైగా గ్రా మాల్లో మైదానాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గర్వకాణంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. మెడికల్ కళాశాల, బైపాస్, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, దేశంలోనే అతిపెద్దదైన ఎకో పార్క్, ట్యాంక్బండ్, ఐటీ పార్కు ఏర్పాటు చేశామని, ట్యాంక్బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, నెక్లెస్రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో అన్ని సౌకర్యాలు క ల్పించినట్లు చెప్పారు.
ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో మరో స్టేడియం నిర్మిస్తున్నామని, స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పీఈటీలు, ప్రజాప్రతినిధులతో కలిసి టగ్ఆఫ్ వార్ ఆ డారు. పోటీలకు మంత్రి అంపైర్గా వ్యవహరించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, జెడ్పీ సీఈవో జ్యోతి, డీవైఎస్వో శ్రీనివాస్, డీఈవో రవీందర్, వజ్రోత్సవాల నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, పీఈటీలు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు.