మహబూబ్నగర్: నిరుపేదలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ రక్షణ కవచంలా ఆదుకునేందుకు నిరంతరం శ్రమి స్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో నియోజకవర్గానికి చెందిన 45 మందికి సీఎం సహయ నిధి నుంచి మంజూరైన రూ.17,90,500 విలువ గల చెక్కు లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికీ ఏ ఆపద వచ్చిన ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వేలాది మందికి సీఎం సహయ నిధి నుంచి సహయం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానలలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ కనివిని ఏరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుం దని తెలియజేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.