మహబూబ్నగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మాతృమూర్తి వి.శాంతమ్మ(73) అనారోగ్యంతో మృతి చెందారు. బెంగళూరులో ద క్షిణాది పర్యాటక శాఖ మంత్రుల సమావేశం ము గించుకుని శుక్రవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయానికి చేరుకుని తల్లి శాంతమ్మతో మంత్రి కాసేపు మాట్లాడారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించే సమయంలో శాంతమ్మకు నర్స్ ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. శాంతమ్మ మరణంతో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆయన భార్య శారద, సోదరుడు శ్రీకాంత్గౌడ్, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం ఉదయం 7:30 గంటలకు బంధుమిత్రుల సందర్శనార్థం మహబూబ్నగర్లో ని మంత్రి స్వగృహానికి శాంతమ్మ మృతదేహాన్ని తీ సుకొచ్చారు. అప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధుమిత్రులు, అధికారులు మంత్రి స్వగృహానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని శ్రీనివాస కాలనీలోని మంత్రి నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బైపాస్ మీదుగా వారి ఫాం హౌస్ వద్దకు అంతిమ యాత్ర చేరుకుంది. ఫాంహౌస్లో మంత్రి తండ్రి సమాధి పక్కనే తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
నాయకుల పరామర్శలు..
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, ఎ మ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, మహేశ్రెడ్డి, అంజయ్య యా దవ్, జైపాల్యాదవ్, మర్రి జనార్దన్రెడ్డి, అబ్ర హం, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీలు మందా జగన్నాథం, మధుయాష్కీ గౌడ్, జితేందర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు సరిత తిరుపత య్య, వనజ, కార్పొరేషన్ల చైర్మన్లు బండారి భా స్కర్, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, బాద్మి శివకుమా ర్, దేవర మల్లప్ప, కలెక్టర్లు ఎస్.వెంకట్రావు, హరిచందన, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చై ర్మన్లు కొరమోని నర్సింహులు, బస్వరాజుగౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, వివి ధ పార్టీల నేతలు, అధికారులు, కార్యకర్తలు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరై శ్రద్ధాంజలి ఘటించారు.
తండ్రి మరణం మర్చిపోకముందే..
ఈ ఏడాది ఫిబ్రవరి 14న మంత్రి తండ్రి నారాయణగౌడ్ అనారోగ్యంతో మృతి చెందగా.. 9 నెల ల వ్యవధిలోనే తల్లి సైతం చనిపోవడంతో మంత్రి తో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను మంత్రి విడిచి ఉండలేకపోయేవారు. ఎక్కడికి వెళ్లినా వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి కాలు బయటపెట్టేవారు. మంత్రి ఏ కార్యక్రమానికి వెళ్లినా తల్లి ఇంటి నుంచే లంచ్ బాక్స్ తయారు చేసి పంపించేది. మొదట తండ్రి, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో మంత్రి తన భార్యాపిల్లలతో కలిసి విలపిస్తున్న దృ శ్యం పలువురిని కంటతడి పెట్టించింది. తల్లిని కో ల్పోవడం తన జీవితంలోనే విషాదకరమైన రోజుగా మారిపోయిందని ఆవేదన చెందారు. ఇటీవల ప్లీనరీకి హాజరయ్యేందుకు వెళ్లే సమయంలో తల్లి ఆశీర్వాదం తీసుకునే బయలుదేరారు.