కొల్లాపూర్ రూరల్, మా ర్చి 26 : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సోమశిల వం తెన కల త్వరలోనే సాకా రం కానున్నది. ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్రెడ్డి సోమశిల-సిద్దేశ్వరం వంతెన జాతీ య రహదారిపై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇందుకు రోడ్డు, భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ కర్నూల్ జి ల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని కరివెన నుంచి ఆం ధ్రా వయా కృష్ణానది మీదు గా 167కే జాతీయ రహదారితోపాటు వంతెన నిర్మాణాలను త్వరలోనే చేపడుతున్నట్లు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి రూ.300 కోట్లు, 105 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.1700 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెడుతామని తెలిపారు. వంతెన, జాతీయ రహదారి మంజూరులో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే బీరం కృషి ఎంతగానో ఉందని చెప్పారు. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లాపూర్ వద్ద కృష్ణానదిలో 42 మంది జలసమాధి అయిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ అలాగే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మంత్రి జూపల్లి ప్రయత్నించారు. టెండర్ల దాకా వచ్చి ఆగిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే బీరం వంతెన, జాతీయ రహదారి నిర్మిస్తే కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గాల ప్రజలకు నందికొట్కూర్, నంద్యాల, కర్నూల్, ఆత్మకూరు వంటి సుదూర పట్టణాలకు దాదాపు 65 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లకు వివరించారు. మంత్రుల సహకారంతో సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసి వంతెన, రహదారి నిర్మాణాలు మంజూరు చేయించారు. ఈ వంతెన పూర్తి అయితే రాకపోకలు పెరిగి వ్యా పారం, టూరిజం పరంగా నాగర్కర్నూల్ జిల్లా పు రోభివృద్ధి సాధిస్తుందని చెప్పొచ్చు.