వాహనాల రాకపోకలకు అంతరాయం
పట్టించుకోని పోలీసులు
వాహనదారులకు తప్పని అవస్థలు
జడ్చర్లటౌన్, అక్టోబర్ 24 : పట్టణంలోని ప్రధాన రహదారులపై లారీల పార్కింగ్తో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారులకు ఇరువైపులా లారీలను అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. అలాగే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రధా న రహదారిపై లారీల పార్కింగ్తో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పటికే పట్టణంలో ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. లారీల పార్కింగ్ తలనొప్పిగా మారింది. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ లారీలను నిలుపడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రహదారులపై కూడా లారీలను పార్కింగ్ చేస్తుండడంతో చిన్నపాటి వాహనాలు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారింది. లారీల పార్కింగ్పై ప్రశ్నిస్తే యజమానులు ఎదురుదాడికి దిగుతున్నారని పలువురు వాహనదారులు వాపోతున్నారు. ప్రధానం గా జడ్చర్ల పోలీస్స్టేషన్ సమీపంలోని పోలీసు క్వా టర్స్, నాగర్కర్నూల్ రహదారిపై నిమ్మబావిగడ్డ వద్ద రోడ్డు పొడవునా లారీలను నిలుపుతున్నారు. అలాగే స్థానిక గౌడ ఫంక్షన్హాల్, మటన్మార్కెట్, టెలిఫోన్ ఎక్చేంజ్ కార్యాలయం, మహబూబ్నగర్ ప్రధాన ర హదారిపై బస్టాండ్కు సమీపంలో రోడ్డుపైనే లారీలను నిలుపుతున్నారు. రహదారులపై అస్తవ్యస్తంగా లారీల ను పార్కింగ్ చేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ద్విచక్రవాహనా లు, ఆటోలను రోడ్లపై ఆపితే వెంటనే చలాన్లు వేస్తున్న పోలీసులు.. లారీల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపక్కన లారీలు నిలుపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ప్రధాన రహదారులపై లారీలను పార్కింగ్ చే యకుండా చర్యలు తీసుకుంటాం. స్థానిక లారీ అసోసియేషన్తో సమావేశం నిర్వహించి రోడ్లపై లారీలు నిలుపకుండా చూస్తాం. పోలీసు ఆదేశాలను బేఖాత రు చేసి ఎవరైనా నిర్లక్ష్య వైఖరితో రోడ్లపై లారీలను పార్కింగ్ చేస్తే చలాన్లు వేస్తాం. పట్టణ రహదారులపై ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతాం.