మహబూబ్నగర్, అక్టోబర్ 23 : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ ప్రాంతంలో ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పోలీసు టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. వివిధ దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ నిషేధిత గుట్కా ఇతర మత్తు ప దార్థాల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, అక్టోబర్ 23 : నిషేధిత గుట్కా తదితర మత్తు పదార్థాల వ్యాపారంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం జడ్చర్ల పట్టణంలోని పలు దుకాణాలు, పాన్షాప్లు, దాబాలు, హోటళ్లల్లో తనిఖీలు చేపట్టారు. జడ్చర్ల సీఐ వీరాస్వా మి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి జడ్చర్ల శివారులోని జాతీయరహదారి, బస్టాండ్ సమీపంలోని దాబాలు, హోటళ్లు, దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి వివరాలు సేకరించారు.
13మందిపై కేసు నమోదు
పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న 13 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వీరాస్వామి తెలిపారు. అలాగే రూ.లక్షా 56వేల విలువైన గుట్కా, జర్దా ప్యాకెట్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గుట్కా, జర్దా విక్రయిస్తున్న 13మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 23 : మండలకేంద్రంలోని పాన్షాపులు, కిరాణా దుకాణా ల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో విక్రయానికి ఉంచిన దాదాపు రూ.10వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, అం బర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. నిషేధిత గుట్కాలను వి క్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో రాజాపూర్ ఎస్సై శ్రీ నివాసులు, ట్రైనీ ఎస్సై పవన్, కానిస్టేబుళ్లు అక్బర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.