మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 22 : మహబూబ్నగర్ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 5వ వార్డు ఏనుగొండలో రూ.10లక్షలతో సీసీరోడ్డు, ఏనుగొండ నుంచి సిద్ధాయపల్లి వరకు రూ.76లక్షలతో బీటీరోడ్డు నిర్మాణ పనులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వీలిన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావొస్తున్నామని, చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో రోజూ ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే అన్ని వార్డుల్లో పార్కులు అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్ వనజ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రవికుమార్, శరత్చంద్ర,మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులను వెలికితీయాలి
హన్వాడ, అక్టోబర్ 22 : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వెలికితీయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హన్వాడ మండలం దయ్యలమర్రితండాకు చెందిన రాహుల్నాయక్ నేపాల్ రాజధాని ఖట్మాండ్లో ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న 2వ ఆసియా బాక్స్ లంగడీ చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. శుక్రవా రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రాహుల్నాయక్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. బాక్స్ లంగడీ చాంపియన్షిప్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణ్, సర్పంచ్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు.