మక్తల్ టౌన్, అక్టోబర్ 21: కౌన్సిల్ సభ్యులు లేకుండా మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ ఎజెండా అంశాలు ఎలా ఆమోదిస్తారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపల్ కార్యాలయం లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడుతూ గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పద కొండుమంది సభ్యులు బాయికాట్ చేసిన తర్వాత కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ కుమ్మక్కై పదకొండుమంది కౌన్సిల్ సభ్యులు బాయికాట్ చేసిన తర్వాత కోరం లేకున్నా తీర్మానాలు ఎలా ఆమోదించుకొంటారని ఎమ్మెల్యే చిట్టెం ప్రశ్నించారు. మినిట్స్ బుక్లో చైర్పర్సన్ పావని ఎలా దిద్దుతారని తెలిపారు. అధికారం తో పది మంది కోసం పనిచేయాలనే తపన ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం సూచించారు. మినిట్స్ బుక్లో కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు బాయికాట్ చేసిన తర్వాత కూడా మినిట్స్ బుక్లో ఎలా ఎంట్రీ చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తీర్మానాలు పాస్ చేసుకోవాలంటే గెజిట్ పాస్ చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఇంతవరకు మున్సిపాలిటీ అబివృద్ధ్ది కోసం మియావాకి, నర్సరీ, మినీట్యాంక్బండ్, మినీట్యాంక్ బండ్పై నేషనల్ హైవేను ఆనుకొని రెండు ఎకారాల్లో పార్క్ నిర్మాణం, మున్సిపాలిటీ సమావేశ భవనం, సమీకృత మార్కెట్, డంపింగ్ యార్డు, పార్క్ వంటి పనులు దగ్గరుండి ప్రోత్సహిస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. కమిషనర్ కు, మున్సిపాలిటీ చైర్పర్సన్కు మున్సిపాలిటీ అభివృద్ధ్ది ఆలోచన లేదు అని ఎమ్మెల్యే చిట్టెం ఆరోపించారు. మున్సిపాలిటీలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరిగితే చూస్తూ ఉన్నారని తెలిపారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ పదహారు వార్డుల్లో ఎప్పుడైన తిరిగారా అని ఎమ్మెల్యే చిట్టెం ప్రశ్నించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, కమిషనర్ రాజయ్య, కౌన్సిలర్లు శ్వేత, జ్యోతి, మొగిలప్ప, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.