మహబూబాబాద్ : జిల్లా పరిధిలోని కొత్తగూడ మండలం వెలుబెళ్లి శివారులో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో ఉన్న నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ సుడిగాలులను టోర్నడో అని కూడా పిలుస్తారు. ఈ టోర్నడోలు భయానక సుడిగాలులను సృష్టిస్తూ మనషుల్లో అలజడిని సృష్టిసాయి. ఆ మాదిరిగానే వెలుబెళ్లి శివారులోని పంట పొలాల్లో బీభత్సం సృష్టించిన సుడిగాలులకు నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటి.. అక్కడున్న కూలీలను ఆందోళనకు గురి చేసింది. ఓ అరగంట పాటు సుడిగాలులు కొనసాగాయి. ఈ బీభత్సానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ టోర్నడోలు అధికంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కనిపిస్తుంటాయి. తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి. నేల మొత్తాన్ని చాప చుట్టేసినట్లుగా.. వాహనాలు, ఇళ్లు, మనుషులు.. చివరికి విద్యుత్ స్థంభాలను సైతం వదలకుండా సర్వనాశనం చేస్తూ భయానక సుడిగాలులు (టోర్నడోలు) బీభత్సం సృష్టిసాయి.
మహబూబాబాద్ జిల్లాలోని వెలుబెళ్లి శివారులో సుడిగాలుల బీభత్సం.. ఆందోళనకు గురైన కూలీలు.. pic.twitter.com/pxXDKcUQBo
— Namasthe Telangana (@ntdailyonline) August 3, 2022