జైపూర్ : రాజస్థాన్లోని జోధ్పూర్లో గురువారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) తెలిపింది. ఉదయం 11.30గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. జోధ్పూర్కు పశ్చిమ-నైరుతి దిశలో 106 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. ప్రకంపనలతో ఒక్కసారిగా జనం ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఉదయం 5.08 గంటల ప్రాంతంలో అరుణాచల్ప్రదేశ్లోని పాంగిన్లో రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ తెలిపింది.