బాసర, అక్టోబర్ 2 : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో ఆదివారం మూలా నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి ఒడిబియ్యం, చీరె, పట్టువస్ర్తాలను అమ్మవారికి సమర్పించారు.
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు చేయించారు. ఈ వేడుకలో నిర్మల్, నిజామాబాద్ జడ్పీ చైర్పర్సన్లు విజయలక్ష్మి, విఠల్రావు తదితరులు పాల్గొన్నారు.