పెద్దపల్లి : జిల్లాలోని ఎన్టీపీసీ రిజర్వాయర్లో ప్లోటింగ్ విధానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను సోమవారం మధ్యప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయ పునరుత్పాక శక్తి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ డాంగ్ సందర్శించారు. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ రిజర్వాయర్పై 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి ప్లాంట్లో పలుకల బిగింపును పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు మంత్రి రాకతో ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట్హౌస్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయనకు ఎన్టీపీసీ సీజీఎం సునీల్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన వెంట ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(రెన్యూవబుల్ ఎనర్జీ) మోహిత్ భార్గవ్, ఎన్టీపీసీ జీఎంలు, ఏజీఎం హెచ్ఆర్ విజయలక్ష్మి, మురళీధరణ్ ఉన్నారు.