న్యూఢిల్లీ : దాదాపు నాలుగువేల కొవిడ్ కేర్ కోచ్ల్లో 64వేల పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించగా.. వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఇండోర్ సమీపంలోని నాగ్పూర్, బోపాల్, తిహి కోసం కొవిడ్ కేర్ కోచ్లను రైల్వే సమీకరించింది. నాగ్పూర్ డివిజన్ రైల్వే మేనేజర్, నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల మధ్య 11 కొవిడ్ కేర్ కోచ్ల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
రాష్ట్ర డిమాండ్ ప్రకారం.. రైల్వేలు మహారాష్ట్రలోని అజ్ని ఐసీడీ ప్రాంతంలో ఐసోలేషన్ కోచ్లను సమీకరిస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, ఎంపీ, మహారాష్ట్రలోని మరో తొమ్మిది ప్రధాన స్టేషన్లలో కూడా కోచ్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని నంద్రుబార్ వద్ద ప్రస్తుతం 57 మంది రోగులు సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. 322 పడకలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో 1200 పడకల సామర్థ్యం కలిగిన 75 కోవిడ్ కేర్ కోచ్ల కోసం రాష్ట్రం పూర్తి డిమాండ్ను రైల్వే అందించింది.
50 బోగీలను షకుర్బస్తీ వద్ద 25 కోచ్లను ఆనంద్ విహార్ స్టేషన్లలో ఉంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్లో పశ్చిమ రైల్వేకు చెందిన రత్లం డివిజన్ ఇండోర్ సమీపంలోని తిహి స్టేషన్లో 320 పడకల సామర్థ్యంతో 20 బోగీలను మోహరించింది. యూపీలో ప్రభుత్వం కోచ్లను అభ్యర్థించనప్పటికీ.. ఫైజాబాద్, భడోహి, వారణాసి, బరేలి, నజీబాబాద్ వద్ద ఒక్కొక్కటి పది బోగీలను 50 బోగీల్లో 800 పడకలు అందుబాటులో ఉంచినట్లు వివరించింది.