హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న ఎన్నికల మరింత వాతావరణం వేడెక్కుతున్నది. ఓ వైపు ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ఎప్పుడూ ప్రచారాలు, ఆరోపణలకే పరిమితం కాగా.. ఈ సారి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ఇవాళ ఉదయం ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ.. మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందంటూ ఆరోపించారు.
బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ‘మా’ ఎన్నికలు జరిపించాలని కోరుతూ మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వివరించారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగాలని విష్ణు లేఖ రాశారని చెప్పారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుపాలని ప్రకాశ్రాజ్ కోరారన్నారు. ఇద్దరి ప్రతిపాదనలను కృష్ణంరాజుకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా బ్యాలెట్కే మొగ్గు చూపారన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.