హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని వివిధ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై అధ్యయనం, విశ్లేషణతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ‘ఎం2 స్మార్ట్’ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ప్రధాన ప్రతినిధి సైటో మిత్స్నూరి పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు జపాన్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఐఐటీ హైదరాబాద్, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, జైకా ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో సంయుక్త సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఐఐటీ-రూరీ, ఐఐటీ-బాం బే నిపుణులను ఈ చర్చకు ఆహ్వానించారు.