న్యూఢిల్లీ : జూన్ 2022 బ్యాచ్కు అత్యధిక వేతన ప్యాకేజ్తో పాటు పెద్దసంఖ్యలో టెక్ గ్రాడ్యుయేట్లకు ప్లేస్మెంట్ ఆఫర్లు దక్కాయని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) వెల్లడించింది. ఎల్పీయూ బీటెక్ గ్రాడ్యుయేట్ హరేకృష్ణకు రూ 64 లక్షల వార్షిక వేతన ప్యాకేజ్తో సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్ నుంచి ఆఫర్ లభించిందని తెలిపింది.
హరేకృష్ణ సీఎస్ఈ స్టూడెంట్ అని, గూగుల్ బెంగళూర్ కార్యాలయం నుంచి ఆయన పనిచేస్తాడని ఎల్పీయూ పేర్కొంది. దేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధికి ఈ ఏడాది అత్యధిక వేతన ఆఫర్ ఇదేనని వెల్లడించింది. 2022 బ్యాచ్కు చెందిన మరో విద్యార్ధి అర్జున్కు ఏఐ, మెషిన్ లెర్నింగ్ డొమైన్లో రూ 63 లక్షల ప్యాకేజ్ లభించిందని తెలిపింది. అర్జున్ కూడా బెంగళూర్ ఆఫీస్ నుంచే పనిచేస్తాడని పేర్కొంది.
గత ఏడాది ఎల్పీయూ విద్యార్ధికి రూ 42 లక్షల ప్యాకేజ్ లభించగా ఈసారి యాభై శాతం అధిక ప్యాకేజ్ దక్కిందని తెలిపింది. టాప్ స్టూడెంట్స్లో పలువురు రూ 10 లక్షల నుంచి రూ 48 లక్షల వేతనాలను దక్కించుకున్నారని ఎల్పీయూ వెల్లడించింది. అమెజాన్, గూగుల్, వీఎంవేర్, టార్గెట్, బజాజ్ ఫిన్సర్వ్, ప్రాక్టో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, విప్రో, ఎంఫసిస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ కంపెనీలు తమ గ్రాడ్యుయేట్లను పెద్దసంఖ్యలో రిక్రూట్ చేసుకున్నాయని ఎల్పీయూ పేర్కొంది.